ఓ స్మగ్లర్ కారణంగా ముగురు పోలీస్ అధికారులకు కరోనా పాజిటివ్ అని తేలింది దింతో ఇక్కసారిగా అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం జైల్లో లో ఉన్నమరియు అతనితో సత్సంబంధాలు కలిగి ఉన్న అందరితో సంప్రదింపులు జరిపి వారికీ కరోనా పరీక్షలు జరుపగా వారిలో స్మగ్లరుతో సహా ముగ్గురు పోలీస్ అధికారులకు కరోనా పాజిటివ్ అని తేలింది. గత మే 29 న బర్నాలా పోలీసులు ముగ్గురు మాదకద్రవ్యాల స్మగ్లర్లను అరెస్టు చేశారు. 273 గ్రాముల హెరాయిన్, రూ .50 వేల మాదకద్రవ్యాలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
దీనికి సంబంధించి బర్నాలా ఎస్ఎస్పి డాక్టర్ సందీప్ గార్గ్ జూన్ 3 న విలేకరుల సమావేశం జరిపారు కూడా. అయితే ఆ ముగ్గురు స్మగ్లర్లను, పోలీస్ సిబ్బందికి మరియు మలేర్కోట్లాలో మెడికల్ స్టోర్ కలిగి ఉన్న 51 ఏళ్ల వ్యక్తి కూడా ఇప్పటివరకుకరోనా పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మాదకద్రవ్యాల స్మగ్లర్ భార్య (28), 70 ఏళ్ల తల్లికి కూడా ఆదివారం సాయంత్రం కరోనా పరీక్షలు చేశారు. ఎస్ఎస్పి, ఎస్పీ (డి), ఎస్పీ (ప్రధాన కార్యాలయాలు), డిఎస్పిలకు నెగటివ్గా రాగా 30 ఏళ్ల కానిస్టేబుల్, ఎఎస్ఐ (51), హోమ్ గార్డ్ (54) లకు ఆదివారం పాజిటివ్ గా వచ్చాయి. స్మగ్లర్ భార్యకు ,అతని తల్లి కి మరియు మెడికల్ స్టోర్ కలిగి ఉన్న 51 ఏళ్ల వ్యక్తి కూడా కూడా కరోనా ఉన్నట్లు పరీక్షలో తేలింది.