బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన మొదటి రకమైన డిజిటల్ రాజకీయ ర్యాలీలో 14 లక్షల మందికి పైగా వినియోగదారులు చేరారని బిజెపి ఆదివారం పేర్కొంది. కరోనా వ్యాప్తిని అరికడుతూ చేసిన మొదటి రాజకీయా ప్రజాత్నం కావడంతో ఈ ర్యాలీకి భారీ స్పందన లభించింది.
హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన మొదటి వర్చువల్ ర్యాలీకి భారీ గా స్పందన లభించింది. ఈ ర్యాలీలో యూట్యూబ్ నుండి 1.5 లక్షల వీక్షణలు, ట్విట్టర్ వేదిక నుండి 66,000 వ్యూస్ వచ్చాయని బిజెపి మీడియా కో-ఇన్ఛార్జ్ సంజయ్ మయూఖ్ తెలిపారు. బీహార్ ఎన్నికల నేపధ్యం లో బీహార్ జాన్ సంవాద్ అనే డిజిటల్ రాజకీయ ర్యాలీలో షా ఆదివారం ప్రసంగించారు. ర్యాలీలో షా ప్రసంగించినప్పుడు బీహార్ జాన్ సంవాద్ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నారని మయూఖ్ పేర్కొన్నారు.ఈ ర్యాలీలో సాధారణ ప్రజలు తమ సోషల్ మాధ్యమాలైన టీవీ మరియు ట్విట్టర్, యూట్యూబ్ , పేస్ బుక్ వంటి మాధ్యమాలలో కోట్ల మంది వీక్షించినట్లు మయూఖ్ పేర్కొన్నారు.
लाइव: केंद्रीय गृह मंत्री श्री @AmitShah वीडियो कॉन्फ़्रेंसिंग के माध्यम से #बिहार_जनसंवाद रैली को संबोधित करते हुए। https://t.co/bufwyTSlom
— bjp (@BJP4India) June 7, 2020