విజయవాడ గ్యాంగ్ వార్ పై ఇప్పుడు పోలీసులు దూకుడు పెంచారు. ఈ గ్యాంగ్ వార్ తో సంబంధం ఉన్న తోట సందీప్ వర్గానికి చెందిన 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరు అందరి మీద నేడు కేసులు పెట్టే సూచనలు కనపడుతున్నాయి. 

 

రౌడీ షీట్ ఓపెన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రధాన నిందితుడు పండు నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక అతని వర్గానికి చెందిన 15 మందిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మందిని ఈ గ్యాంగ్ వారక్ కి సంబంధించి విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకునే సూచనలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: