ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిగే సూచనలు కనపడుతున్నాయి. ఈ నెల 18 న రాజ్యసభ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభకు వెళ్తున్న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఆ రెండు శాఖలకు సంబంధించి ఎవరిని ఇప్పుడు తీసుకుంటారు అనేది చూడాలి. 

 

మంత్రి వర్గ విస్తరణ పై వైసీపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉండే సూచనలు కనపడుతున్నాయి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనితో మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: