తెలంగాణాలో బిజెపిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో బిజెపి సీనియర్ నేత ఈగ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఉప్పల్‌ విజయపురికాలనీలో నివాసం ఉంటారు. శ్రీనివాస్‌కు ఆదివారం  ఛాతిలో నొప్పిరావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అప్పటికే విషమించడంతో మృతి చెందారని వైద్యులు చెప్పారు. 

 

ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారని బిజెపి నేతలు పేర్కొన్నారు. ఆయన ఆర్‌ఎస్ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారని... బీజేపీ ఉప్పల్‌ డివిజన్‌ అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. ఉప్పల్‌లో సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల వ్యవస్థాపకుల్లో ఒకరు ఆయన. శ్రీనివాస్‌ భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ నివాళులర్పించి ఆయన లేని లోటు తీరనిది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: