ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. బంధాలు బంధుత్వాలు మరిచి మానవత్వం మరిచిన మనుషులు సాటి మనుషుల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడడం లేదు. వెరసి రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయని ఉన్నాయి. హత్యలు చేసిన వారికి కఠిన శిక్షలు విధిస్తూ ఉన్నప్పటికీ ఎవరు మాత్రం కనిపించడం లేదు. 

 

 తాజాగా నిజాంబాద్ జిల్లా నర్సాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న అల్లుడు అర్వన్ ను  మామ అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. అయితే మామ అల్లుడు నీ హత్య చేయడం వెనుక వివాహేతర సంబంధమే అసలైన కారణం అని అంటున్నారు . ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగిందని లేదా వివాహేతర సంబంధమే దీనికి కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: