దేశ వ్యాప్తంగా ఇప్పుడు అడవి జంతువుల సందడి మొదలయింది. తెలంగాణా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు అడవి జంతువులు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక చిరుత పులి కలకలం సృష్టించింది. ఇండోర్‌లో ఐఐటీ సమీపంలో పులి ప్రజలను భయపెట్టింది. 

 

వెంటనే అటవీ శాఖ అధికారులకు అక్కడ ఉన్న వారు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని... కొన్ని గంటలపాటు శ్రమించి చిరుతను బంధించారు అధికారులు. వెంటనే స్పందించిన రిస్క్యూ టీమ్ చిరుతను బంధించి, వ్యాన్ ఎక్కించి తరలించింది. ఇక అది బంధించినా సరే కాస్త దూకుడుగానే స్పందించడంతో అధికారులు అడివిలో కాకుండా జూలో దాన్ని  ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: