దేశంలో ఓ వైపు కరోనాతో ప్రజలు నానా బాధలు పడుతుంటే.. మరోవైపు క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు.  గత నెల వరకు దేశంలో కేసులు పెద్దగా లేకున్నా ఇటీవల లాక్ డౌన్ సడలింపు చేసినప్పటి నుంచి క్రైమ్ రేటు మళ్లీ పెరుగుతుంది. ఆడవారిపై అఘాయిత్యాలు, హత్యలు.. అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. రాజాజీ ఆస్పత్రికిలోకి సోమవారం ఉదయం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ప్రవేశించారు. అయితే అక్కడ చికిత్స తీసుకుంటున్న ఓ వ్యక్తిపై పదునైన  ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో రోగి తీవ్రంగా గాయపడ్డాడు. 

 

తీవ్రంగా గాయ పడ్డ ఆ రోగి అక్కడిక్కడే మరణించాడు.  ఈ విధ్వంసం అంతా అక్కడ ఉన్న రోగులు చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రాజాజీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆస్పత్రిలో హత్య జరిగే సరికి మిగతా రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: