ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ హోం ఐసోలేషన్ కి వెళ్ళారు. ఆయన కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి జ్వరం తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆయన హోం ఐసోలేషన్ కి వెళ్లినట్టు ఢిల్లీ సిఎం కార్యాలయం అధికారులు మీడియాకు వివరించారు. దీనితో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్ళారు. 

 

ఆయన అన్ని అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. రేపు ఆయన కరోనా పరిక్షలు చేయించుకుంటారు అని అధికారులు పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఢిల్లీ లో కరోనా కేసులు 30 వేలకు చెరువులో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ లాక్ డౌన్ సడలింపుల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: