టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మురళీ శర్మ. తాజాగా ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మురళీ శర్మ మాతృమూర్తి శ్రీమతి పద్మ(76) అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ముంబైలోని మురళీ శర్మ స్వగృహంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. 
 
మురళీ శర్మ 2020 సంక్రాంతి పండుగకు విడుదలైన అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. తన అద్భుతమైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న మురళీ శర్మ కుటుంబం ముంబైలో స్థిరపడినా వీరిది తెలుగు కుటుంబమే కావడం గమనార్హం. మురళీశర్మ తల్లి పద్మ గారు ఏపీలో గుంటూరు జిల్లాకు చెందిన వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: