కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేసారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని, కేటీఆర్‌ లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్‌ చెబుతున్నారని ఆరోపించారు. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా సోషల్ మీడియాలో పేర్కొన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. 

 

డ్రోన్‌ కేసులో తనను అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్‌ అక్కడ ఉంటున్నారని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జన్వాడ ఫాంహౌస్‌ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందన్న ఆయన... 301 సర్వే నెంబర్లలో కేటీఆర్‌ సతీమణి పేరిట 3 ఎకరాలు ఉందని ఈ సందర్భంగా ఆరోపించారు. భూములు లేవని కేటీఆర్‌ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: