ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఫుడ్ డెలివరి సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇక నుంచి స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి. దీనిపై  ఇన్‌స్టాగ్రామ్ ఒక ప్రకటన చేసింది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు గానూ ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్లను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంది. 

 

ఫుడ్ ఇండస్ట్రీలో భాగమైన చిన్న వ్యాపారులు తమ వినియోగదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడటానికి అదే విధంగా కొత్త రుచులను అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అమెరికా, కెనడాలో ఏప్రిల్ లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారత్‌లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. యూజర్లు ఈ స్టిక్కర్‌పై ట్యాప్ చేసిన వెంటనే నేరుగా స్విగ్గీ, జొమాటోలకు వెళ్లి ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: