షేక్ పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు మూడు రోజుల నుంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. పలు భూ అక్రమాలకూ సంబంధించి అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో మూడు సంచుల్లో దొరికిన 30 లక్షలపై అధికారులు ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆమె భర్త  వాంగ్మూలం కూడా రికార్డ్ చేసారు. 

 

ఆమె ఏమో ఆ డబ్బులు నా కష్టార్జితం అని చెప్తున్నారు. ఆయన ఏమో భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇంట్లో పెట్టామని చెప్తున్నారు. అసలు ఆ 30 లక్షలు ఎక్కడివి అని చెప్పడం లో మాత్రం ఇద్దరు తడబడుతున్నారు అని అధికారులు గుర్తించారు. ఆమె విషయంలో నేడు ఏదోక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: