ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మరో రాజధానిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. రేపటి నుంచి ఆ రాష్ట్రంలో మరో రాజధాని అమలులోకి వస్తుంది అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొత్తగా ఏర్పాటైన రెండవ రాజధాని గైర్సైన్ అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
ఇది వేసవి రాజధానిగా ఉంటుందని.... రెండవ రాజధాని ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన నోటిఫికేషన్ను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మీడియా ముందు పెట్టారు. చమోలి జిల్లాలో ఉన్న కొత్త రాజధాని గైర్సైన్ను వేసవి రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర శాసన సభ తీర్మానం కూడా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడింది.