హైద‌రాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న ఓ టైర్ల షాపులో పనిచేసే ఓ యువకుడు వేధింపులు భ‌రించ‌లేక ఓ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అమీర్‌పేట ఈస్ట్‌ శ్రీనివాస్‌నగర్‌ కాలనీలోని అనురాగ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆర్టీసీ కండక్టర్‌ ఎం. గోపాల్, లావణ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు అశ్విని (22) రంగరాజు గోకరాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు చదువుకుంటానని అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లింది.

 

కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్‌చేసి విష‌యం చెప్పింది. గోపాల్‌ వెంటనే పైకి వెళ్లి చూడగా నోట్లో నుండి నురగలు కక్కుతూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాదం నెల‌కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: