ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, సీ కల్యాణ్, రాజశేఖర్, జీవిత తదితరులు హాజరుకానున్నారు. సినిమా షూటింగ్స్కు అనుమతిపై వారు ముఖ్యమంత్రి జగన్తో చర్చించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా సినీ ప్రముఖులు కలిసిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్ అనుమతికి సంబంధించి చర్చించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.