పంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షల ఖర్చును కూడా ఎలా తగ్గించుకోవచ్చునన్న అంశంపై కూడా అనేకమంది పరిశోధకులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోని వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు కీలక విషయం చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సాంకేతి కతతో కోవిడ్-19 టెస్ట్ ఖర్చును తగ్గించుకోవచ్చని ఆయన చెప్పారు.
అధ్యాపక శిక్షణలో భాగంగా నిట్లో ఐదు రోజు ల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎఫ్డీపీ) ప్రారంభ మైంది. గోటూ మీటింగ్ యాప్ ద్వారా ఆన్లైన్ శిక్షణ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ రాజు మాట్లాడు తూ.. క్యాన్సర్ వంటి రోగాలను గుర్తించడంలో ఏఐ సహాయ పడు తుందన్నారు. డాక్టర్లకు హెల్త్కేర్, ప్రభుత్వాలకు సోషల్ డిస్టెన్సింగ్లో, స్మార్ట్అగ్రికల్చర్ విభాగాల్లో ఏఐ పనితీరుపై శిక్షణ ఉంటుందన్నారు.