ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జీరో యాక్టివ్ కేసుల నుంచి నేడు యాక్టివ్ కేసులు 50 వరకు వెళ్ళాయి జిల్లాలో. జిల్లాలో కొత్తగా మరో 10 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో పాజిటివ్ కేసుల సంఖ్య 127 చేరుకుంది. నిన్న పొదిలిలో 3, సీఎస్ పురంలో 4, కనిగిరి, పందిళ్లపల్లిలో ఒక్కో కరోనా కేసు నమోదు అయినట్టు అధికారులు వివరించారు. 

 

జిల్లాలో 45,775 కరోనా పరిక్షలు చేసారు అధికారులు. 42,033 నెగిటివ్ ఫలితాలు రాగా 3615 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 84 మంది డిశ్చార్జ్ అయ్యారు అని... ప్రస్తుతం ఆస్పత్రుల్లో 47 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు. ప్రస్తుతం అక్కడ రికవరీ రేటు ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: