మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా పోలీస్ అధికారులు అక్కడ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఒక సామాన్య ప్రజలు కూడా భారీ మొత్తంలో ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు.
ప్రతిరోజు కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీస్ అధికారుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా 24 గంటల వ్యవధిలో ఏ ఒక్క పోలీసు అధికారి కూడా కరోనా వైరస్ బారిన పడక పోవడం గమనార్హం. ఇక మొత్తంగా పోలీసు ఫోర్స్ లో కరోనా వైరస్ కేసులు 2562 వద్ద ఉన్నాయి. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 34 వద్ద ఉంది అని తాజాగా సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.
No new #COVID19 case in maharashtra police over the last 24 hours. Total coronavirus cases in the force stand at 2,562, death toll at 34: maharashtra police pic.twitter.com/ue69R3zcvJ
— ANI (@ANI) June 9, 2020