ఈ మధ్య మనుషుల్లో మానవత్వం కనపడటం లేదు అని కొన్ని కొన్ని సంఘటనల ఆధారంగా స్పష్టంగా చెప్పొచ్చు. కొందరు కనీస విజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కోపాన్ని ఆపుకోలేక కొందు ఆస్తులు ఆర్ధిక వ్యవహారాలతో మరికొందరు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా తెలంగాణాలో జరిగిన ఒక సంఘటన భయపెట్టే విధంగా ఉంది. 


ఓ కిరాతక భర్త తన భార్యతో పాటుగా ఆమె తండ్రిని కూడా  అత్యంత దారుణంగా నరికి చంపేసాడు. వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట్ గ్రామంలో కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: