గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది అనే కోపంతో కూతుర్ని చంపేసారు. కులాంతర పెళ్ళి వద్దు అంటూ దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన దివ్య అనే డిగ్రీ విద్యార్ది వేరే కులానికి చెందిన యువకుడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు గర్భం కూడా వచ్చింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది.

 

  ఈ క్రమంలో దివ్య గర్భిణి అని కూడా తెలియడంతో ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. ఆ అబ్బాయికి దూరంగా ఉండాలని ఆ అమ్మాయిని హెచ్చరించారు. అయితే ప్రేమించిన వాడిని వదిలేది లేదని చెప్పింది. దీనితో  తమ కుమార్తెను గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్యచేశారు ఆ తల్లి తండ్రులు. స్థానికులతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి తల్లి తండ్రులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: