ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయన రెండు రోజుల నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న నేపధ్యంలో కరోనా టెస్టులు చేయించుకోవాలని హోం ఐసోలేషన్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎప్పటి నుంచో మధుమేహం తో పాటుగా ఆస్తమాకు కూడా మందులు వాడుతున్నారు. 

 

రేపు ఫలితాలు వస్తాయి. కేజ్రీవాల్ ఇప్పటికే అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. ఇక అక్కడ కరోనా వ్యాప్తికి కేంద్రమే కారణం అనే ఆరోపణలు వస్తున్నాయి. కేసులు క్రమంగా పెరగడంపై ఢిల్లీ వాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: