తమ పార్టీపై విమర్శలు చేసే ముందు అసలు చైనా బలగాలు దేశంలో అడుగుపెట్టాయో లేదో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి డిమాండ్ చేసారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ పై ఆయన తీవ్ర విమర్శలు చేసారు. చేతి గుర్తుపై రక్షణ మంత్రి విమర్శలు చేసేముందు ఒకదానికి సమాధానం చెప్పాలని... 

 

లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందా లేదా..?’’ అని ఆయన నిలదీశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తర్వాత సరిహద్దులను కాపాడుకోగల సత్తా ఇప్పుడు భారత్‌కు మాత్రమే ఉందని హోం మంత్రి అమిత్ షా అనడంపై రాహుల్ స్పందించారు. సరిహద్దుల్లో మన పరిస్థితి అందరికీ తెలుసులే అని ఆయన ఎద్దేవా చేసారు. రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి కూడా ఘాటుగానే స్పందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: