ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం వైఎస్ జగన్ ని కలవడానికి గానూ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సినీ ప్రముఖులు తాడేపల్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని విషయంలో తమకు న్యాయం చెయ్యాలని సిఎం జగన్ ని కోరాలి అంటూ రాజధాని ప్రాంత మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు వారు ఉండే గెస్ట్ హౌస్ ముందు. 

 

మూడు రాజధానులు వద్దు రాజధానే ముద్దని ప్లకార్డుల కూడా ప్రదర్శించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు సినీ హీరోలను, ప్రముఖులను డిమాండ్ చేసారు. ఇక మహిళలు భారీగా రావడంతో అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: