గత నాలుగు నెలలుగా ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా జరిగే అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా కనపడలేదు అనే విషయం అందరికి తెలిసిందే. ఒక్క క్రికెట్ మ్యాచ్ ని కూడా నిర్వహించే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడలేదు అనే చెప్పాలి. కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతూ పోతున్న నేపధ్యంలో క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ సాధ్యం కాలేదు. 

 

ఈ నేపధ్యంలో క్రికెట్ లో కీలక అడుగు పడింది. వచ్చే నెలలో మొదలు కానున్న మూడు టెస్ట్ ల సీరీస్ కోసం ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్ళింది వెస్టిండీస్ జట్టు.  ఏడు వారాల పాటు అక్కడ ఉండే టీం కోసం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని కరోనా పరిక్షలు చేసి వారిని విమానం ఎక్కించారు. రెండు ప్రత్యేక విమానాల్లో వాళ్ళు బయల్దేరి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: