బిజెపి అగ్ర నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటుగా ఆయన తల్లికి కూడా కరోనా సోకిందని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయనకు ఇటీవల జ్వరం గొంతు నొప్పి రాగా ఇద్దరికీ కరోనా పరిక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

ఆయనకు లక్షణాలు కనపడగా ఆయన తల్లికి మాత్రం లక్షణాలు కనపడలేదు. ఆయన తల్లి మాధవి రాజే సింధియా ను ఆయన్ను ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వారి ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆయనకు ఏ విధంగా కరోనా సోకింది అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: