ప్రపంచంలో ప్రకృతికి కోపం వస్తే ఎంత వినాశనం అవుతుందో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది.  అయితే అతి వృష్టి.. లేదా అనా వృష్టి. దీనికి కారణం పచ్చదనం పూర్తిగా అంతరించిపోతుంది. పచ్చగా ఉండే చెట్లను నరికి తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న మనుషులకు రాను రాను గాలి, నీరు అన్నీ కాలుష్యం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడుప్రతి ఒక్కరూ తమకు చేతనైనన్ని చెట్లను నాటి వన సంపదను పెంచాలని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ చేశారు.  ఇందులో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పాల్గొంటున్నారు. 

IHG

తాజాగా  తాజాగా ఈ ఛాలెంజ్ లో సినీనటి కీర్తి సురేశ్ కూడా పాల్గొంది. తన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని... భవిష్యత్తును గ్రీనరీగా, హెల్దీగా మార్చాలని పిలుపునిచ్చింది. కీర్తి మొక్కలు నాటిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ, మళియాళ, హిందీ భాషల్లో మంచి ఫామ్ లో కొనసాగుతుంది కీర్తి సురేష్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: