ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల పంపిణి కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. వైఎస్ జయంతి నేపధ్యంలో జులై 8 న ఈ ఇళ్ళ పట్టాల కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఎకరాలను సేకరించి సిద్దంగా ఉంచింది. దీనిపై వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ట్వీట్ చేసారు. 

 

“ఒకే రోజు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే మహా యజ్ఞానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జూలై 8 న మహానేత డా. వైఎస్సార్ జయంతి నాడు 46 వేల ఎకరాల భూమిని ప్లాట్లుగా పంపిణీ చేయాలని సీఎం జగన్ గారు ఆదేశించారు. ఇచ్చిన స్థలాల్లో 4 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: