ఆంధ్రప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్ సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చారు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సిఎం జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా షూటింగ్ లు లేక నానా ఇబ్బందులు పడ్డామని ఆయన పేర్కొన్నారు. ఏపీలో కూడా సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. 

 

కరోనా కారణంగా షూటింగ్ లేక ఇబ్బంది పడ్డామని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహం కోరుకున్తామని అన్నారు. సిఎం జగన్ తెలుగు సినీ పరిశ్రమ వెన్నంటే ఉంటారు అని చెప్పారు అని చిరంజీవి అన్నారు. ఏడాది కాలంగా జగన్ ని కలవాలి అని అనుకుంటున్నామని అన్నారు. థియేటర్ ల మినిమం ఫిక్సిడ్ చార్జీలు ఎత్తివేయాలి అని తాము కోరినట్టు ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: