కోర్ట్ ల లాక్ డౌన్ విషయంలో తెలంగాణా హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి జిల్లాల్లో కోర్ట్ లు తెరవాలి అని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. 15 రోజులకు ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని హైకోర్ట్ పేర్కొంది. దశల వారీగా లాక్ డౌన్ ని ఎత్తివేయడానికి గానూ ముందుకు వెళ్తున్నామని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. 

 

జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే నెల 8 వరకు పరిమిత సంఖ్యలో కేసులను విచారించాలి అని తాము భావిస్తున్నట్టు పేర్కొంది. జిల్లా కోర్ట్ లు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఓపెన్ చెయ్యాలని స్పష్టం చేసింది రాష్ట్ర హైకోర్ట్. దీనిపై త్వరలోనే హైకోర్ట్ మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: