గుంటూరులో ఉన్నట్టుండి 30 లక్షల నగదు ఒక్కసారిగా మాయం అయింది. ఈ ఘటన గుంటూరు గోరంట్ల వద్ద జరిగింది. అసలు ఎం జరిగింది అనేది ఒకసారి చూస్తే.. ఏటిఏం వ్యాన్‌లో నగదు ఉండగా ఆ వాన్ బ్యాంకు ముందు ఆగింది. అక్కడి నుంచి వాన్ లో ఆ డబ్బులను తీసుకుని బ్యాంకు అధికారులు గోరంట్లలోని సెంట్రల్ బ్యాంక్ ఏటిఎంలో నగదు పెట్టేందుకు వెళ్ళారు. 

 

మొత్తం అందులో 30 లక్షలు ఉన్నాయి. ఉన్నపళంగా ఆ డబ్బులు కనపడకుండా పోయాయి. దీనితో అక్కడ ఉన్న స్థానికులు కూడా కాసేపు షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి సిబ్బందిని స్టేషన్ కి తరలించారు. దీనిపై విచారణ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: