ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న కరోనా లక్షణాలు కనిపించడంతో సెల్ఫ్ క్వారంటైన్ కు పరిమితమైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక వైద్య బృందం ఈరోజు ఆయన రక్త నమూనాలను సేకరించింది. తాజాగా కరోనా పరీక్షలకు సంబంధించిన ఫలితం వెలువడింది. సీఎం కేజ్రీవాల్ కు కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. సీఎం కేజ్రీవాల్ నిన్న జ్వరం, గొంతు నొప్పి సమస్యలతో బాధ పడ్డారు. 
 
ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు టెన్షన్ పడ్డాయి. కేజ్రీవాల్ కు కరోనా నిర్ధారణ అయితే వందల సంఖ్యలో సిబ్బంది క్వారంటైన్ కు పరిమితం కావాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కరోనా నెగిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: