నటుడు మరియు మాజీ యంపీ మురళీమోహన్ ఇలాకాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మురళి మోహన్ కుమారుడు ఇంట్లో పనిచేస్తున్న పనిమనుషులకు కరోనా సోకినట్లు అధికారులు తెలియజేసారు. వారిలో ఇద్దరు భార్య భర్తలు మరొక మహిళా వంటమనిషిగా గుర్తించారు.

 

 

అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉంటున్న ఓ మహిళకి కరోనా పాజిటివ్ గా తేలింది అదేవిధంగా టోలిచౌక్ లో ఉంటున్న 75 ఏళ్ళ వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. శివాజీ నగర్ కు   చెందిన వ్యక్తి (49 ) గత కొద్దిరోజులుగా కరొనతో బాధపడుతున్నారు. ఆ వ్యక్తిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి రక్త పరీక్షలను చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది దింతో శివాజీ నగర్ ప్రాంతనంతటిని అధికారులు కట్టుదిట్టం చేసారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: