పాకిస్తాన్లో కరోనావైరస్ రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ పర్యటనకు జాతీయ జట్టును సిద్ధం చేసే శిక్షణా శిబిరాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 108,000పైగా చేరుకుంది. 2,172 మరణాలు నమోదయ్యాయి. ముందుముందు వైరస్ ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని భావించిన పీసీబీ క్రికెట్ శిక్షణా శిబిరాన్ని రద్దు చేసింది.
ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయొద్దని కోరింది. కాగా, ఆగస్టు ఆరంభం నుంచి మూడు టెస్టులు, మూడు ట్వంటీ 20 లు ఆడాలని పాకిస్తాన్ భావిస్తోంది.