ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఇప్పుడు కార్యకర్తలు కింది స్థాయి నాయకులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రామాపురం తండాలో వైసీపీలోని ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. 

 

తండాలో ఉపాధి హామీ పనుల విషయంలో ఈ వివాదం తలెత్తింది. చిన్న గొడవ కాస్తా అది తీవ్రంగా మారి దాడులు చేసుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. దీనితో ఇరు వర్గాలు కూడా పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: