దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నేడు కూడా దాదాపు పది వేల కేసులు నమోదు అయ్యాయి అని  కేంద్రం హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు విడుదల చేసిన లెక్కలు ఒకసారి చూస్తే దేశంలో మొత్తం 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

 

ఇప్పటివరకు 1,35,206 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య చూస్తే 2.76 లక్షలు దాటింది. రికవరీ రేటు క్రమంగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఆరోగ్యం విషమంగా ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని లెక్కలు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: