కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎం చేసిందో కేసీఆర్ సిఎం అయిన తర్వాత ఎం చేసారు అనేది భేరీజు వేసుకుందామని మంత్రి కేటిఆర్ అన్నారు. గోదావరి జలాలకు సిరిసిల్ల జిల్లాలో ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో రైతులను రాబందుల్లా పీక్కుని తిన్న వాళ్ళు ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

చాలా చెరువులు నిండుతాయని ప్రజలు చెరువుల్లో ఈత కొట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. మన చెరువులు నిండుతు ఉంటే మన పొలాలు పండుతూ ఉంటే విపక్షాలు ఒర్వలేకపోతున్నాయని అన్నారు. ఇప్పట్లో ఎన్నికలు ఏమీ లేవు అని ఇక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేస్తామని అన్నారు ఆయన. కరోనా నుంచి అందరూ బయటపడాలి అని ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: