తెలంగాణాలో కరోనా వైరస్ నేపధ్యంలో బోనాలను రద్దు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. బోనాలపై హైదరాబాద్ నగర మంత్రులు అందరూ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు కీలక  నిర్ణయం తీసుకున్నారు. ఎవరి ఇంట్లో వారే బోనాలు జరుపుకోవాలి అని ఆయన సూచించారు. 

 

గ్రేటర్ ప్రజలు అందరూ దీనికి సహకరించాలి అని ఆయన కోరారు. పూజారులు దేవాలయాల్లో బోనాలు నిర్వహిస్తారని అన్నారు. ఊరేగింపుగా బోనాలు తీసుకువెళ్ళి బోనాలు తీసుకుని వెళ్లి నిర్వహిస్తారని కరోనా కారణంగా ఈ ఏడాది బోనాలను రద్దు చేసామని అన్నారు. కాగా నిన్న సాయంత్రం కేసీఆర్ బోనాలపై సమీక్షా సమావేశ౦లో చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా బోనాలు వద్దు అనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: