రెండు రోజుల క్రితం కడప జిల్లా గోపవరం మండలం పెద్దపోలుగుంట గ్రామం దగ్గర మహిళ చున్నీ బైక్ లో చిక్కుకుని మహిళ ప్రాణం పోయిన ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. కరోనా నుంచి రక్షణగా ఉంటుందని భావించిన చున్నీ మరో మహిళ ప్రాణం తీసింది. ఖమ్మం జిల్లాలో బైక్ వెనుక చక్రంలో చున్నీ చిక్కుకుపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మాలంబీ(45) లాక్ డౌన్ కారణంగా కొత్తగూడెంలోని తన అన్న ఇంటికి వచ్చింది. 
 
సొంతూరుకు వెళ్లాలని బంధువు గఫార్ తో కలిసి బైక్ పై బయలుదేరగా మాలంబీ చున్నీ బైక్ వెనుక టైర్ లో చుట్టుకుంది. తల్లాడ-వరంగల్‌ రాష్ట్రీయ ప్రధాన రహదారిలో లూర్దు మాత చర్చి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల వెనుక భాగం రోడ్డుకు బలంగా తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలో మృతి చెందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: