డాక్టర్ అనితా రాణి వ్యవహారంలో తనపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పందించారు. తాను డాక్టర్ అనితా రాణి కి అన్యాయం చేశా అని నిరూపిస్తే మాత్రం తాను కచ్చితంగా రాజీనామా చేస్తా అని ఆయన ఛాలెంజ్ చేసారు. తానే ఒక దళిత కులానికి చెందినవాడిగా ఉండి డాక్టర్ అనితారాణికి ఎలా అన్యాయం చేస్తానని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారో అర్థం కావడంలేదని ఆయన ప్రశ్నించారు. 

 

చంద్రబాబు కుల రాజకీయాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడమే పని అంటూ ఆయన ఆరోపించారు. గతంలో మాల, మాదిగలను విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారని ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: