కాంగ్రెస్ నేతలపై కేటిఆర్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్ స్పందించారు. గోదావరి జలాలపై కనీస అవగాహన లేకుండా అమంత్రి కేటిఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. గోదావరి జలాలపై పిచ్చోడిలా మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేసారు. ప్రాజెక్ట్ లపై చర్చకు సిద్దమా అని ఆయన సవాల్ చేసారు. 

 

కాంగ్రెస్ నేతలు జల దీక్ష చేస్తామని అంటుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ఆయన  నిలదీశారు. కేటిఆర్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. ప్రజలను పిచ్చోళ్ళు అని అనుకుంటున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. కాగా సిరిసిల్ల కు కాళేశ్వరం జలాలు వచ్చిన సందర్భంగా కేటిఆర్ కాంగ్రెస్ నేతల లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కళ్ళు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: