టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీనిపై స్పందించారు. శివప్రసాద్ తన బాల్య స్నేహితుడని హితుడని ఆయన గుర్తు చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు, రంగస్థల మరియు సినీ నటుడు, దర్శకుడు అన్నిటినీ మించి నా బాల్య స్నేహితుడు, హితుడు అయిన కీ.శే. డాక్టర్ ఎన్. శివ ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. శివ ప్రసాద్ స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ చంద్రబాబు తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. లోకేష్ తో పాటు వైసీపీ నేతలు కూడా ఆయనకు నివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు, రంగస్థల మరియు సినీ నటుడు, దర్శకుడు... అన్నిటినీ మించి నా
వైద్యం, రంగస్థలం, సినీరంగం, రాజకీయం...ఇలా విభిన్న రంగాలలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ, కీ.శే.ఎన్.శివప్రసాద్ గారు. ఈరోజు శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా.. ఎమ్మెల్లేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు, పార్టీకి వారు చేసిన సేవలను స్మరించుకుందాం. pic.twitter.com/l8oF6esPpE
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 10, 2020బాల్యస్నేహితుడు, హితుడు అయిన కీ.శే. డాక్టర్ ఎన్. శివప్రసాద్ జయంతి సందర్భంగా... ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ.. శివప్రసాద్ స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/7RmHjmtPew
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) June 10, 2020