ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకి సతీ ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించిన నేపధ్యంలో కొన్ని చానల్స్ వస్తున్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సుప్రీం కోర్ట్ ఏ తీర్పు పాస్ చేయలేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రెండు వారల తర్వాత వాదనలు వింటామని సుప్రీం కోర్ట్ చెప్పిందని సుప్రీం కోర్ట్ ప్రొసీడింగ్స్ రాకుండానే వార్తలు రాయడం సమంజసమా అని ఆయన నిలదీశారు.

 

 కొన్ని చానల్స్ అత్యుత్సాహం కోర్ట్ దిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్తామనే సుప్రీం కోర్ట్ చెప్పిందని సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వకుండానే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: