ఈ మద్య టిక్ టాక్ చేసి పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే టిక్ టాక్ వల్ల చాలా మంది తమ ప్రాణాలు రిస్క్ లో పెట్టి చనిపోయిన వారు ఉన్నారు.  ప్రతి విషయాన్ని టిక్ టాక్ చేస్తూ జనాల్లో పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  అయితే ఈ టిక్ టాక్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేసి చనిపోయిన వారు ఉన్నారు. తాజాగా ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె నిరాకరించింది. తనది స్వచ్చమైన ప్రేమ అని నిరూపించుకోడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా ఆ అమ్మాయి పట్టించుకోలేదు.  ప్రేమ మాత్రమే జీవితం కాదని తెలుసుకోలేని అతడు  కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

 

తన ప్రేమ విఫలం కావడంతో జీవితం పై విరక్తి పెంచుకున్నాడు. తర్వాత నేరుగా వెళ్లి రైలు కింద పడి చనిపోయాడు. అనంతపురం జిల్లాలోని గుత్తిలో ఈ విషాదం జరిగింది. కేఎం రాము అనే బిఎస్సీ విద్యార్థి ప్రేమ విఫలమై బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయి డిగ్రీ కాలేజీలో చదువుతున్న రాము తాను ప్రేమించి అమ్మాయి ఇక దక్కదని ఆందోళన పడ్డాడు. . లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్ టాక్ చేసిన రాము తర్వాత ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: