టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా సిపిఐ అగ్ర నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అంపశయ్య మీద ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారు అని ఆయన ఆరోపించారు. తాను ఎందుకు ఓడిపోయానో చంద్రాబాబు తెలియదు అనడం కామెడి గా ఉందని ఆయన ఎద్దేవా చేసారు. 

 

సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడ మకాం మార్చాలి అని చెప్తే చంద్రబాబు వినలేదు అని నారాయణ ఆరోపించారు. రాజధానికి నాలుగు నుంచి 5 వేల ఎకరాలు చాలు అని చెప్పినా చంద్రబాబు వినలేదు అని అన్నారు. అత్యాశకు పోయి అమరావతిని సక్సెస్ చేయలేదు అని అన్నారు. ఓటు కు నోటు కేసు తర్వాత తంతే విజయవాడలో పడ్డాడు అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: