ఈ మద్య మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా వైవాహిక సంబంధాలు చిన్న చిన్న విభేదాలు రావడంతో భార్యా భర్తలు దూరమవుతున్నారు. వీరి ప్రభావం చిన్నపిల్లలపై పడుతుందన్న విషయం తెలిసినా.. తమ స్వార్థం మాత్రమే ఆలోచిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధాలతో ఒకరిపై ఒకరి అనుమానంతో చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. తాజాగా ఓ భార్య భర్తను దారుణంగా గొంతు కోసి మరీ చంపింది. అనుమానంతో నిత్యం వేదిస్తున్న భర్తను దారుణంగా హత్య చేసిన భార్య ఉదంతం వనపర్తి జిల్లా పెద్దమందండి మండలం స్కూల్‌ తండాలో చోటు చేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే... స్కూల్‌ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్యాతండాకు చెందిన మెగావత్‌ బాల్య నాయక్‌, భార్య మణెమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండగా లాక్‌డౌన్‌తో పనిలేక దంపతులిద్దరూ సొంత తండాకు తిరిగి వచ్చారు. ఇక భర్త పెట్టే బాధలు.. ఆ అనుమానాలు తట్టుకోలేక.. భార్య మణెమ్మ మంగళవారం రాత్రి నిద్రిస్తున్న భర్త బాల్య నాయక్‌ గొంతు కోసి హత్య చేసిందని ఎస్సై రాము తెలిపారు. హత్యలో కూతురు ప్రమేయం కూడా ఉందని ఆయన వివరించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: