ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చిన గంటల వ్యవధిలో ఏపీ హైకోర్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్ట్ ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్ ముగ్గురు తమ పదవులకు రాజీనామా సమర్పించారు.  

 

 

గత ఏడాదిగా హైకోర్ట్ లో అన్ని కేసులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వస్తున్న నేపధ్యంలో ముగ్గురు రాజీనామాలను వెంటనే ఏపీ లీగల్ సెక్రటరీ జి. మనోహర్ రెడ్డి ఆమోదించారు. త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా ముగ్గురు న్యాయవాదుల ఖాళీలను ఏపీ సర్కార్ భర్తీ చేయనుంది. కాగా సుప్రీం కోర్ట్ నిమ్మగడ్డ రమేష్ విషయంలో హైకోర్ట్ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: