నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన సోమవారం పదవి బాధ్యతలను తిరిగి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. 

 

దీనిపై నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎప్పుడు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: