ఆగస్టు 15 నాటికి కనక దుర్గ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకుని రావాలి అని అధికారులకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ సంస్థ సోమా ప్రాజెక్టు ప్రతినిధులతో కలిసి కృష్ణవేణి ఘాట్‌ వద్ద, భవానీపురంలో జరుగుతున్న ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కరోనా నేపధ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు.

 

ఆ నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన సూచనలు చేసారు. ఇందుకోసం అవసరమైన సిబ్బంది, కార్మికుల ద్వారా పనులు నిర్వహించుకునేందుకు 300 మంది కార్మికులను ఏర్పాటు చేసుకోవచ్చని ఈ సందర్భంగా సూచనలు చేసారు. ఆయనతో పాటుగా ఎన్హెచ్ అధికారులు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: