ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఇద్దరు మంత్రులపై ఆగ్రహంగా ఉన్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇటీవల జరిగిన కొన్ని వ్యవహారాలూ ఇప్పుడు సిఎం జగన్ లో ఆగ్రహానికి కారణంగా మారింది అంటున్నారు. రాజకీయంగా కూడా వారు చేసే వ్యవహారాలూ తనకు తల నొప్పిగా మారాయని జగన్ ఇటీవల కొందరి వద్ద వ్యాఖ్యలు చేసారట. 

 

దీనితో ఇప్పుడు వారిని కేబినేట్ నుంచి తప్పించే అవకాశం ఉంది అని సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మంత్రిని అలాగే  దాని సరిహద్దున ఉన్న మరో జిల్లాలో కూడా మంత్రిని తప్పించే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నారు అని అంటున్నారు. ఏపీలో వచ్చే నెలలో కేబినేట్ కూర్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ రాజీనామాలు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: